ETV Bharat / state

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

author img

By

Published : Dec 28, 2020, 4:39 AM IST

అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వేమూరు మండలంలోని జంపనీలో చోటుచేసుకుంది.

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

గుంటూరు జిల్లా జంపనిలో అప్పుల బాధలు తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఎకరాలు కౌలుకు తీసుకున్న శ్రీనివాసరావు.. 4 ఎకరాల్లో నిమ్మతోట, 3 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

గుంటూరు జిల్లా జంపనిలో అప్పుల బాధలు తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 7 ఎకరాలు కౌలుకు తీసుకున్న శ్రీనివాసరావు.. 4 ఎకరాల్లో నిమ్మతోట, 3 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చదవండి: సజ్జల నన్ను హత్యచేయించాలని చూస్తున్నారు: జేసీ ప్రభాకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.