ETV Bharat / state

సొంత గూటికి వలస కూలీలు - గుంటూరు కరోనా వార్తలు

గుంటూరు జిల్లాలో చిక్కుకున్న వలస కూలీలను గత నాలుగు రోజులుగా.. తమ సొంత గూటికి చేరుస్తున్నామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​ కుమార్ తెలిపారు. కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి.. నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారినే పంపిస్తున్నామని చెప్పారు.

due to corona lockdown Migrant laborers going to their own homes from guntur district
due to corona lockdown Migrant laborers going to their own homes from guntur district
author img

By

Published : May 2, 2020, 12:54 PM IST

గుంటూరు జిల్లాలో 40 వేల మంది వలస కూలీలను గుర్తించినట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. వారందరినీ సొంతూళ్లకు పంపించే ప్రక్రియ గత 4 రోజుల నుంచి చేపట్టినట్లు వివరించారు. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాకు 800 బస్సుల్లో కూలీలు వెళ్లారని తెలిపారు. అలాగే మరో 200 బస్సులను కర్నూలు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఇతర రాష్ట్రాల కూలీలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా సంయుక్త కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారినే పంపిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కిట్ల సంఖ్య తక్కువగా ఉన్నందున వారిని పంపించేందుకు ఒకటి రెండు రోజులు సమయం పట్టొచ్చన్నారు.

గుంటూరు జిల్లాలో 40 వేల మంది వలస కూలీలను గుర్తించినట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. వారందరినీ సొంతూళ్లకు పంపించే ప్రక్రియ గత 4 రోజుల నుంచి చేపట్టినట్లు వివరించారు. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాకు 800 బస్సుల్లో కూలీలు వెళ్లారని తెలిపారు. అలాగే మరో 200 బస్సులను కర్నూలు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఇతర రాష్ట్రాల కూలీలను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా సంయుక్త కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ ఫలితాలు వచ్చిన వారినే పంపిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కిట్ల సంఖ్య తక్కువగా ఉన్నందున వారిని పంపించేందుకు ఒకటి రెండు రోజులు సమయం పట్టొచ్చన్నారు.

ఇదీ చదవండి:

స్వస్థలాలకు వలస కూలీలు.. పాటించాల్సిన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.