అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 25వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 4 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఉప శాసన సభాపతి కొన రఘుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటక పోటీలలో విజేతలుగా నిలిచిన కళాకారులకు బహుమతులు, ఆర్థిక సాయం అందించారు. అనంతరం విజేతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, పలువురు కళాకారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి