రాజధాని అమరావతికి మద్ధతుగా తుళ్లూరులో కాంగ్రెస్ పార్టీ ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని దీక్షను చేపట్టింది. దీక్షలో ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ, అ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకరి పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలపగా.. రాజధాని అమరావతిపై కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ లేదా అమిత్ షా ఆదేశిస్తే అరంగంటలో సమస్య పరిష్కారమవుతుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనలను కాంగ్రెస్ నేత సుంకరి పద్మశ్రీ తప్పుపట్టారు.
'రాజధానిపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి' - కేంద్రప్రభుత్వం పై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
రాజధాని అమరావతిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. 232 రోజులుగా రైతులు, మహిళలు ఉద్యమం చేస్తుంటే కేంద్రం చోద్యం చూడటం భావ్యం కాదని ఆయన ఆక్షేపించారు.

రాజధాని అమరావతికి మద్ధతుగా తుళ్లూరులో కాంగ్రెస్ పార్టీ ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని దీక్షను చేపట్టింది. దీక్షలో ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ, అ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకరి పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలపగా.. రాజధాని అమరావతిపై కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ లేదా అమిత్ షా ఆదేశిస్తే అరంగంటలో సమస్య పరిష్కారమవుతుందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనలను కాంగ్రెస్ నేత సుంకరి పద్మశ్రీ తప్పుపట్టారు.
ఇదీ చదవండి: ఈత కల్లు తాగిన ముగ్గురికి అస్వస్థత