ETV Bharat / state

మాజీమంత్రి ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై కేసీఆర్​కు ఫిర్యాదు - minister eetala land issue latest news

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్​ భూ కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు మరో ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని మహేశ్​ ముదిరాజ్ అనే వ్యక్తి కేసీఆర్​కు ఫిర్యాదు చేశారు.

ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై కేసీఆర్​కు ఫిర్యాదు
ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై కేసీఆర్​కు ఫిర్యాదు
author img

By

Published : May 23, 2021, 7:40 PM IST

తెలంగాణ మాజీమంత్రి ఈటల రాజేందర్​ భూ కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు మరో ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా రావల్​కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్​ ముదిరాజ్ అనే వ్యక్తి కేసీఆర్​కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. మహేశ్​ ఫిర్యాదును పరిశీలించిన ముఖ్యమంత్రి.. తక్షణం దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి.. నివేదిక అందించాలని సీఎం ఆదేశాల్లో పేర్కొన్నారు.

తెలంగాణ మాజీమంత్రి ఈటల రాజేందర్​ భూ కబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు మరో ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా రావల్​కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేశ్​ ముదిరాజ్ అనే వ్యక్తి కేసీఆర్​కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. మహేశ్​ ఫిర్యాదును పరిశీలించిన ముఖ్యమంత్రి.. తక్షణం దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి.. నివేదిక అందించాలని సీఎం ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది: ఏకే సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.