గత 4 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా ఉంటూ.. చిట్టీలు నిర్వహించి అందరినీ నమ్మించారు. తీరా 5, 6 లక్షలు చిట్టీలు కట్టిన తరువాత నిర్వహకులు పరారయ్యారు. దీంతో బాధితులంతా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
పెదకాకనిలో నివాసం ఉండే శ్యామలదేవి, శ్యామ్ కుమార్లు చిట్టీలు నిర్వహించేవారు. తమ వద్ద నుండి 5, 6 లక్షల చొప్పున మొత్తం 17 మంది దగ్గర రూ.65 లక్షల వరకు కట్టించుకున్నారని బాధితులు తెలిపారు. చిట్టి నిర్వహకులు గ్రామాన్ని వదిలి వెళ్లడమే కాకుండా తమకు ఐపీ నోటీసులు పంపించటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. చిట్టీల పేరుతో రూ.65 లక్షలు కట్టించుకొని నిర్వహకులు పరారయ్యారని బాధితులు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి