ఎప్పుడూ పుస్తకాలు, హోం వర్కులు, పరీక్షలతో కుస్తీపట్టే విద్యార్థుల్లో కార్నివాల్ సంబరం ఉత్సాహాన్ని నింపింది. పిల్లల ఉత్సాహం చూసి పెద్దలు మురిసిపోయారు. గుంటూరు సమీపంలోని లాం దిల్లీ పబ్లిక్ స్కూల్లో చిన్నారుల కార్నివాల్ నిర్వహించారు. పిల్లల కేరింతలు, సందడితో కార్నివాల్ మార్మోగిపోయింది. ఒత్తిడి నుంచి కొంచెం ఉపశమనం లభించేందుకు పాఠశాల యాజమాన్యం 40 రకాల ఆటలు నిర్వహించింది. పిల్లలకు మానసికోల్లాసం, మనోవికాసం అవసరమని.. అందుకే ప్రతియేటా ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
ఇవీ చదవండి.. ఆ చెట్టు వేర్లను చూస్తే ఔరా అనాల్సిందే..!