గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బొడ్డు నాగేశ్వరరావు మరోసారి బరిలోకి దిగుతున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు...బొడ్డు నాగేశ్వరరావుతో ఉపాధ్యాయులకు పరిచయం కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే మార్చిలో జరగనున్న ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా తనను బలపర్చాలని ఉపాధ్యాయలను నాగేశ్వరరావు కోరారు. గతంలో పనిచేసినట్లే నీతి,నిజాయతీతో పనిచేస్తానని... తప్పును తప్పుగా..,ఒప్పును ఒప్పుగా మండలిలో పోరాడుతానన్నారు. అధికార పార్టీకి కొమ్ముకాసే విధానం తమ విధానం కాదని నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇదీచదవండి
తిరుపతిలో తెదేపా గెలుపే లక్ష్యం.. నిర్లక్ష్యాన్ని సహించను: చంద్రబాబు