గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భాజపా జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, మద్యం, గనుల మాఫియాపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. ఈ మూడు మాఫియాల రాజ్యాన్ని తీవ్రంగా ఎండగడతామన్నారు. సంఘటన పరంగా బలోపేతం అవుతూ మండల స్థాయిలో భాజపా ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండీ.. WATER DISPUTES: తెలంగాణపై ఏపీ మంత్రిమండలి సీరియస్