రాజ్యాంగపరంగా ఏర్పడిన అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి జగన్ గౌరవించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బండారు లక్ష్మణ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల సంస్థ అన్న విషయం సీఎం గుర్తించాలని అన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో ఏ విధంగా సుప్రీంకోర్టుకు వెళ్లారో.. అదే గౌరవం ఎన్నికల సంఘంపైనా చూపాలన్నారు. ప్రపంచమంతా కరోనాకు భయపడి జాగ్రత్తలు తీసుకుంటే.. సీఎం జగన్ మాత్రం పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని అనడంపై కన్నా మండిపడ్డారు. జగన్కు 'శంకర్దాదా' బిరుదు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. నియంత పాలనలో ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం, పోలీసులు యత్నిస్తున్నారని... ఈ విషయాల్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని కన్నా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని దుర్వినియోగం చేయటంపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: