ETV Bharat / state

పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: తెదేపా నేతపై దాడి

author img

By

Published : Jun 24, 2020, 10:52 AM IST

Updated : Jun 24, 2020, 12:53 PM IST

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో తెదేపా నాయకుడు షేక్‌ గౌస్‌పై దాడి జరిగింది. రాళ్లు, కర్రలతో దుండగులు దాడి చేసిన ఘటనలో.. గౌస్‌ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పిడుగురాళ్లలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు.

Attack on tdp activist in guntur
గుంటూరులో తెదేపా నేతపై దాడి

గుంటూరు జిల్లాలో తెదేపా కార్యకర్తలపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా నేత షేక్ చింతపల్లి గౌస్​పై దాడి జరిగింది. రాయి, కర్రలతో కొట్టగా గౌస్ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కుటుంబ సభ్యులు పిడుగురాళ్లలోని ప్రైవైట్ ఆసుపత్రికి తరలించారు.

తెదేపా నేతపై దాడి

ప్రస్తుతం గౌస్​కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందునే దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నిక ప్రక్రియ మొదలైన సమయంలో ఇలాగే దాడులు జరిగాయి. మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కావటం కారణంగా పల్నాడులో ఆందోళన నెలకొంది.

తెదేపా నేతపై దాడి

గుంటూరు జిల్లాలో తెదేపా కార్యకర్తలపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా నేత షేక్ చింతపల్లి గౌస్​పై దాడి జరిగింది. రాయి, కర్రలతో కొట్టగా గౌస్ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కుటుంబ సభ్యులు పిడుగురాళ్లలోని ప్రైవైట్ ఆసుపత్రికి తరలించారు.

తెదేపా నేతపై దాడి

ప్రస్తుతం గౌస్​కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందునే దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గతంలో స్థానిక ఎన్నిక ప్రక్రియ మొదలైన సమయంలో ఇలాగే దాడులు జరిగాయి. మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కావటం కారణంగా పల్నాడులో ఆందోళన నెలకొంది.

తెదేపా నేతపై దాడి

ఇవీ చదవండి:

'మీ కాళ్లు మొక్కుతాం.. గుడిసెలు తొలగించొద్దు'

Last Updated : Jun 24, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.