గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.. కరోనా సోకి ప్రొఫెసర్ మృతి చెందారు. బోటనీ, మైక్రో బయాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రఘురామ్కు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన ప్రాణాలు కోల్పోయారు. రఘురామ్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 2006లో సహాయాచార్యులుగా ఏఎన్యూలో చేరారు. 2018లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉద్యోగోన్నతి సాధించారు. గతనెల వారణాసి వెళ్లిన ఆయన కరోనా బారిన పడ్డారు. విశ్వవిద్యాలయంలో కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు.
ఇదీ చదవండి: