ETV Bharat / state

కరోనా రోగులకు యాంటిబాడీ కాక్​టెయిల్ ప్రయోగం!

author img

By

Published : May 29, 2021, 3:21 PM IST

గుంటూరులో కరోనాతో బాధపడుతున్న రోగులకు యాంటిబాడీ కాక్​టెయిల్, రీజెనరాన్ ఇంజక్షన్​ను ప్రయోగించారు. కరోనా రోగులకు ఈ ఔషధాన్ని వాడితే మంచి ఫలితాలు ఉంటాయని డా.కల్యాణ చక్రవర్తి తెలిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం వీటిని అందరికీ అందుబాటులోకి తేవాలని కోరారు.

Antibody cocktail and regenaron injection
యాంటిబాడీ కాక్​టెయిల్, రీజెనరాన్ ఇంజక్షన్ ప్రయోగం

గుంటూరులో కరోనా రోగులకు యాంటిబాడీ కాక్‌టెయిల్ ఇంజక్షన్​ను ప్రయోగించారు. ప్రముఖ వైరాలజిస్ట్ కల్యాణ చక్రవర్తి పర్యవేక్షణలో ఇంజక్షన్ వినియోగించారు. నగరంలోని శ్రీ హాస్పిటల్​లో కొవిడ్​తో బాధపడుతున్న ఇద్దరు రోగులకు రీజెనరాన్ ఇంజక్షన్​ను వినియోగించారు. రీజెనరాన్​తో 24 గంటల్లో మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్ తెలిపారు.

ఇంజక్షన్ ప్రయోగించిన బాధితులను త్వరలో ఇంటికి పంపుతామని వైద్యుడు చక్రవర్తి అన్నారు. కరోనా రోగులకు ఈ ఔషధం వాడితే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 70 శాతం మంది త్వరగా కోలుకున్నారని వెల్లడించారు. రీజెనరాన్‌ డోసు ధర రూ.60 వేలు ఉండటంతో ఈ మొత్తాన్ని వెచ్చించి పేదలు చికిత్స పొందడం కష్టం అవుతున్నందున... ఔషధాన్ని ప్రభుత్వం అందరికీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.

గుంటూరులో కరోనా రోగులకు యాంటిబాడీ కాక్‌టెయిల్ ఇంజక్షన్​ను ప్రయోగించారు. ప్రముఖ వైరాలజిస్ట్ కల్యాణ చక్రవర్తి పర్యవేక్షణలో ఇంజక్షన్ వినియోగించారు. నగరంలోని శ్రీ హాస్పిటల్​లో కొవిడ్​తో బాధపడుతున్న ఇద్దరు రోగులకు రీజెనరాన్ ఇంజక్షన్​ను వినియోగించారు. రీజెనరాన్​తో 24 గంటల్లో మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్ తెలిపారు.

ఇంజక్షన్ ప్రయోగించిన బాధితులను త్వరలో ఇంటికి పంపుతామని వైద్యుడు చక్రవర్తి అన్నారు. కరోనా రోగులకు ఈ ఔషధం వాడితే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఇంజక్షన్ తీసుకున్న వారిలో 70 శాతం మంది త్వరగా కోలుకున్నారని వెల్లడించారు. రీజెనరాన్‌ డోసు ధర రూ.60 వేలు ఉండటంతో ఈ మొత్తాన్ని వెచ్చించి పేదలు చికిత్స పొందడం కష్టం అవుతున్నందున... ఔషధాన్ని ప్రభుత్వం అందరికీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

Anandaiah Medicine: ఆనందయ్య మందు నివేదికలో ఏముంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.