ETV Bharat / state

347వ రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు

author img

By

Published : Nov 28, 2020, 7:37 PM IST

అమరావతి రైతుల దీక్షలు 347వ రోజుకు చేరాయి. గుంటూరులోని పలు గ్రామాల్లో మహిళలు ఆందోళనలు చేపట్టారు. త్వరలోనే తమ ఉద్యమ ఫలితం రాబోతోందని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు.

amaravathi farmers protest in guntur district over three capital system
347వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్షలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ గుంటూరులో రైతులు 347వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, పెదపరిమి, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.

త్వరలోనే తమ ఉద్యమ ఫలితం రాబోతోందని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ఆందోళనలను ప్రభుత్వం చిన్నచూపు చూసిందని... అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. తమ ఉద్యమం న్యాయపరమైందని అందుకే తమకు న్యాయస్థానాలు అండగా నిలిచాయన్నారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ గుంటూరులో రైతులు 347వ రోజు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, పెదపరిమి, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.

త్వరలోనే తమ ఉద్యమ ఫలితం రాబోతోందని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ఆందోళనలను ప్రభుత్వం చిన్నచూపు చూసిందని... అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. తమ ఉద్యమం న్యాయపరమైందని అందుకే తమకు న్యాయస్థానాలు అండగా నిలిచాయన్నారు.

ఇదీ చదవండి:

'పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.