ETV Bharat / state

నమ్మకంతో భూములిస్తే రైతులను అవమానపరుస్తారా ?- జీవీఆర్‌ శాస్త్రి

author img

By

Published : Apr 30, 2021, 10:46 AM IST

Updated : Apr 30, 2021, 11:41 AM IST

మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అన్నదాతలు చేపట్టిన పోరాటం 500వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా ఐకాస ఆధ్వర్యంలో 'అమరావతి ఉద్యమ భేరి' పేరిట లక్ష మందిలో వర్చువల్ బహిరంగ సభను చేపట్టారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. అమరావతి ఐకాస గౌరవ అధ్యక్షుడు జీవీఆర్‌ శాస్త్రి సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

amaravathi
జీవీఆర్‌ శాస్త్రి

అమరావతి అన్నదాతలు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం 500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో అమరావతి ఉద్యమ భేరి పేరిట వర్చువల్ విధానంలో సభ నిర్వహించారు. ఉద్యమం 500వ రోజుకు చేరిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాయపూడి దీక్ష శిబిరంలో దళిత చైతన్య గీతం సీడీని.. అమరావతి ఐకాస నేతలు, ఎస్సీ ఐకాస నేతలు విడుదల చేశారు. ఉద్ధండరాయినిపాలెం దీక్షా శిబిరంలో బుద్ధిని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐకాస నేతలు, అన్నదాతలు, మహిళలు పాల్గొన్నారు.

'రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. నమ్మకంతో భూములిస్తే అవమానపరుస్తారా?ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం. అమరావతికి జరిగిన అన్యాయం తట్టుకోలేక ఎంతోమంది రైతుల గుండెలాగాయి. అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి వందనాలు. అమరావతి ఉద్యమం అజరామరం, త్వరలోనే మంచిరోజులు. రానున్న రోజుల్లో పరిణామాలు మారుతాయి. అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుంది'- జీవీఆర్‌ శాస్త్రి, అమరావతి ఐకాస గౌరవ అధ్యక్షుడు

అమరావతి అన్నదాతలు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం 500 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో అమరావతి ఉద్యమ భేరి పేరిట వర్చువల్ విధానంలో సభ నిర్వహించారు. ఉద్యమం 500వ రోజుకు చేరిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాయపూడి దీక్ష శిబిరంలో దళిత చైతన్య గీతం సీడీని.. అమరావతి ఐకాస నేతలు, ఎస్సీ ఐకాస నేతలు విడుదల చేశారు. ఉద్ధండరాయినిపాలెం దీక్షా శిబిరంలో బుద్ధిని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐకాస నేతలు, అన్నదాతలు, మహిళలు పాల్గొన్నారు.

'రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. నమ్మకంతో భూములిస్తే అవమానపరుస్తారా?ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం. అమరావతికి జరిగిన అన్యాయం తట్టుకోలేక ఎంతోమంది రైతుల గుండెలాగాయి. అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి వందనాలు. అమరావతి ఉద్యమం అజరామరం, త్వరలోనే మంచిరోజులు. రానున్న రోజుల్లో పరిణామాలు మారుతాయి. అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుంది'- జీవీఆర్‌ శాస్త్రి, అమరావతి ఐకాస గౌరవ అధ్యక్షుడు

ఇదీ చదవండి:

'త్యాగం నిరుప‌యోగం కాదు.. అమ‌రావ‌తి శాశ్వతం'

Last Updated : Apr 30, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.