ETV Bharat / state

పొంట పొలాల్లో వ్యక్తి దారుణ హత్య

author img

By

Published : Mar 2, 2020, 3:42 PM IST

పొలానికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా గంగవరంలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే మాటు వేసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుంటుబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

a man murdered by unknown people in gangavaram in guntur
గుంటూరులో వ్యక్తి దారుణ హత్య
గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని గంగవరంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గంగవరానికి చెందిన తోట సత్యనారాయణ శనివారం రాత్రి పొలానికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం వేకువజామున పొలం నుంచి వస్తున్న వారు మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని చెప్పులు, అన్నం క్యారేజీ, టార్చ్​లైట్ మృతదేహం వద్ద పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: బొలెరో బోల్తా, ఓ బాలుడి మృతి

గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని గంగవరంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గంగవరానికి చెందిన తోట సత్యనారాయణ శనివారం రాత్రి పొలానికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం వేకువజామున పొలం నుంచి వస్తున్న వారు మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని చెప్పులు, అన్నం క్యారేజీ, టార్చ్​లైట్ మృతదేహం వద్ద పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: బొలెరో బోల్తా, ఓ బాలుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.