ETV Bharat / state

పెద్దకర్మకు పిలవలేదని ..స్నేహితుడిపై కత్తితో దాడి

author img

By

Published : Dec 13, 2020, 11:25 AM IST

పెద్దకర్మ సందర్భంగా భోజనానికి పిలవలేదని ఓ వ్యక్తి తన స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

bollapalli knife attack
స్నేహితుడిపై కత్తితో దాడి

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో భోజనానికి పిలవలేదని ఓ వ్యక్తి తన స్నేహితుడిని కత్తితో పొడిచాడు. మండలంలోని గరికపాడుకు చెందిన మొక్కపాటి రామారావు... అదే గ్రామానికి చెందిన పసుపులేటి రత్నం స్నేహితులు. వీరు రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఇటీవల రామారావు తల్లి చనిపోయింది. ఆమె పెద్దకర్మ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. కానీ.. రామారావు.. రత్నంను పిలవలేదు. అతను ఫోన్‌లో తిట్టడంతో... బండ్లమోటు పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు రామారావు.

ఈ క్రమంలోనే బజారులో కూర్చున్న రామారావుపై రత్నం కత్తితో దాడి చేసి పొట్ట, వీపుపైన పొడిచాడు. బాధితుడిని స్థానికులు వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రామారావును గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో భోజనానికి పిలవలేదని ఓ వ్యక్తి తన స్నేహితుడిని కత్తితో పొడిచాడు. మండలంలోని గరికపాడుకు చెందిన మొక్కపాటి రామారావు... అదే గ్రామానికి చెందిన పసుపులేటి రత్నం స్నేహితులు. వీరు రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఇటీవల రామారావు తల్లి చనిపోయింది. ఆమె పెద్దకర్మ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. కానీ.. రామారావు.. రత్నంను పిలవలేదు. అతను ఫోన్‌లో తిట్టడంతో... బండ్లమోటు పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు రామారావు.

ఈ క్రమంలోనే బజారులో కూర్చున్న రామారావుపై రత్నం కత్తితో దాడి చేసి పొట్ట, వీపుపైన పొడిచాడు. బాధితుడిని స్థానికులు వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రామారావును గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

కూలీల ఇంట విషాదం.. మృతదేహాలతో ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.