ETV Bharat / state

'అన్ని ప్రాంతాల అభివృద్ధి..... వికేంద్రీకరణతోనే సాధ్యం' - గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు.

A large public meeting was held under the auspices of ycp in the town of Rapalle in Guntur district
రేపల్లె పట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ
author img

By

Published : Jan 19, 2020, 11:58 PM IST

'అన్ని ప్రాంతాల అభివృద్ధి..... వికేంద్రీకరణతోనే సాధ్యం'

వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైకాపా నేతలు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని నెహ్రు బొమ్మ సెంటర్ వద్ద వైకాపా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ర్యాలీగా వచ్చి బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పలువురు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మంత్రులు మోపిదేవి వెంకట రమణ, మేకతోటి సుచరిత, నారాయణ స్వామి, బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము పోరాడుతుంటే... తెదేపా నేతలు విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. తెదేపా పాలనలో తాత్కాలిక నిర్మాణాలతో ప్రజా ధనాన్ని వృథా చేశారని వారు ఆరోపించారు. బినామీల పేరుతో అమరావతిలో వందల ఎకరాల భూములను తెదేపా నేతలు కొనుగోలు చేశారని... వికేంద్రీకరణ జరిగితే తమ భూములకు ఖరీదు రాదనే ఉద్దేశంతోనే ప్రజలను మభ్యపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కష్టపడుతున్నారని.. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. వికేంద్రీకరణతో అమరావతిలోని ప్రజలకు ఎలాంటి నష్టం జరగదన్నారు.

ఇవీ చదవండి...బిల్లులకు మండలిలో ఆమోదం లభించేనా?

'అన్ని ప్రాంతాల అభివృద్ధి..... వికేంద్రీకరణతోనే సాధ్యం'

వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైకాపా నేతలు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని నెహ్రు బొమ్మ సెంటర్ వద్ద వైకాపా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ర్యాలీగా వచ్చి బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పలువురు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మంత్రులు మోపిదేవి వెంకట రమణ, మేకతోటి సుచరిత, నారాయణ స్వామి, బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము పోరాడుతుంటే... తెదేపా నేతలు విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. తెదేపా పాలనలో తాత్కాలిక నిర్మాణాలతో ప్రజా ధనాన్ని వృథా చేశారని వారు ఆరోపించారు. బినామీల పేరుతో అమరావతిలో వందల ఎకరాల భూములను తెదేపా నేతలు కొనుగోలు చేశారని... వికేంద్రీకరణ జరిగితే తమ భూములకు ఖరీదు రాదనే ఉద్దేశంతోనే ప్రజలను మభ్యపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కష్టపడుతున్నారని.. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. వికేంద్రీకరణతో అమరావతిలోని ప్రజలకు ఎలాంటి నష్టం జరగదన్నారు.

ఇవీ చదవండి...బిల్లులకు మండలిలో ఆమోదం లభించేనా?

Intro:ap_gnt_46_19_ycp_bahiranga_sabha_av_ap10035

వికేంద్రీకరణ వలన ర్రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నేతలు అన్నారు.గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని నెహ్రు బొమ్మ సెంటర్ వద్ద వికేంద్రీకరణ జరగలంటూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.ర్యాలీగా వచ్చి బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పూలమాలలు వేశారు.కార్యక్రమంలో మంత్రులు మోపిదేవి. వెంకట రమణారావు, మేకతోటి.సుచరిత ,నారాయణ స్వామి, ఎంపీ నందిగాం సురేష్, పలువురు వైసిపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి జగన్ అలుపెరగని పోరాట యోధుడని వైసీపీ నేతలు కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతుంటే టిడిపి నేతలు విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. గడిచిన టిడిపి పాలనలో తాత్కాలిక నిర్మాణాలతో ప్రజా ధనాన్ని వృధా చేసారని మంత్రులు,ఎమ్మెల్యేలు ఆరోపించారు.స్వలాభం కోసం టిడిపి నేతలు వికేంద్రీకరణ జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు.బినామిల పేరుతో అమరావతి లో వందల ఎకరాల భూములను టిడిపి నేతలు కొనుగోలు చేశారని...వికేంద్రీకరణ వలన తమ భూములకు ఖరీదు రాదనే ఉద్దేశ్యంతో ప్రజలను మభ్యపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కష్ట పడుతున్నారని..దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ..క్షేత్ర స్థాయిలో అందరికి అందేలా వైసిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.అన్ని వర్గాల వారిని ఆదుకునేల సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. వికేంద్రీకరణ వలన అమరావతిలో ప్రజలకు ఎలాంటి నష్టం జరగదన్నారు.జగన్ నిర్ణయాలకు మనమందరం మద్దతు తెలిపి అభివృద్ధి కి బాటలు వేయాలని కోరారు.


Body:av


Conclusion:etv contributer
meera saheb 7075757517
repalle
guntur jilla

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.