ETV Bharat / state

ఆపరేషన్ ముస్కాన్... 1371 చిన్నారులకు విముక్తి

రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న పిల్లల అదృశ్యాలు, బాల కార్మిక వ్యవస్థపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో 693 బృందాలు తనిఖీలు చేపట్టగా 1371 మంది బాలకార్మికులను గుర్తించారు. వీరిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

author img

By

Published : Sep 6, 2019, 9:14 PM IST

Updated : Sep 6, 2019, 10:18 PM IST

డీజీపీ

బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్​ను చేపట్టారు. పుస్తకాలు పట్టి బడికి వెళ్లాల్సిన వయస్సులో బాల కార్మికులుగా మారుతున్న వారిని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 693 బృందాలు ఏర్పాటు చేసి హోటళ్లు ,రెస్టారెంట్స్, గృహాలు, షాపుల్లో తనిఖీలు చేపట్టారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కార్మికులుగా పనిచేస్తున్న 1371 బాలలను గుర్తించారు. వీరిలో 1192 మంది బాలురు,179 బాలికలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 286 మంది బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన వారిని ఛైల్డ్ రెస్క్యూ హోమ్​కు తరలించారు. చాలా మంది పిల్లలు వీధుల్లో తిరుగుతూ... చెడుదారి పడుతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను బడికి పంపాలని లేకుంటే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు 70 మంది చిన్నారులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని గుర్తించారు. చిన్నారుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. చిరునామా తెలుసుకుని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ఛైల్డ్ వెల్ఫేర్, పోలీసులు, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు.

బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్​ను చేపట్టారు. పుస్తకాలు పట్టి బడికి వెళ్లాల్సిన వయస్సులో బాల కార్మికులుగా మారుతున్న వారిని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 693 బృందాలు ఏర్పాటు చేసి హోటళ్లు ,రెస్టారెంట్స్, గృహాలు, షాపుల్లో తనిఖీలు చేపట్టారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కార్మికులుగా పనిచేస్తున్న 1371 బాలలను గుర్తించారు. వీరిలో 1192 మంది బాలురు,179 బాలికలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 286 మంది బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన వారిని ఛైల్డ్ రెస్క్యూ హోమ్​కు తరలించారు. చాలా మంది పిల్లలు వీధుల్లో తిరుగుతూ... చెడుదారి పడుతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను బడికి పంపాలని లేకుంటే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు 70 మంది చిన్నారులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని గుర్తించారు. చిన్నారుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. చిరునామా తెలుసుకుని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ఛైల్డ్ వెల్ఫేర్, పోలీసులు, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు.

Intro:333Body:888Conclusion:కడప జిల్లా అట్లూరు లో ఘోరం జరిగింది గేదెల కోసం వెతుక్కుంటూ వెళ్లి ఓ యువకుడు మృతిచెందగా మరో ఇద్దరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు

అట్లూరు కు చెందిన సుదర్శన్ రెడ్డి గేదెలు కనిపించకుండా పోయాయి. ఇంటికి రాకపోవడంతో వెతుక్కుంటూ నరసింహులు రమణారెడ్డి తో కలిసి సుదర్శన్ రెడ్డి సోమశిల వెనుక వైపు వెళ్లారు. అక్కడ సగిలేరు నది దాటే ప్రయత్నంలో సుదర్శన్ రెడ్డి బురదలో కూరుకుని ఒడ్డుకు రాలేకపోయారు .అతని వెంట వెళ్లిన మరో ఇద్దరు నరసింహులు, రమణారెడ్డి , అతికష్టంమీద ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. డిగ్రీ చదివి చేతికొచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు వెంకటసుబ్బారెడ్డి రత్నమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై అట్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Sep 6, 2019, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.