ETV Bharat / state

Protest: అక్కిరెడ్డిగూడెంలో స్థానికుల ఆందోళన.. పోలీసుల బందోబస్తు

Protest at akkireddygudem: ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగగా.. సిబ్బంది, స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామ శివారులో రోడ్డుకు అడ్డంగా ముళ్లకంపలు వేసి రాకపోకలను అడ్డుకున్నారు. ఘటనలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Apr 14, 2022, 10:14 AM IST

people protest at akkireddygudem over fire accident
అక్కిరెడ్డిగూడెంలో పరిశ్రమ సిబ్బంది, స్థానికుల ఆందోళన
అక్కిరెడ్డిగూడెంలో పరిశ్రమ సిబ్బంది, స్థానికుల ఆందోళన

Protest at akkireddygudem: ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం గ్రామ శివారులో.. పోరస్​ పరిశ్రమ సిబ్బంది, స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటన జరిగిన పోరస్ పరిశ్రమలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా.. పరిశ్రమ ముందు బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా ముళ్లకంపలు వేసి రాకపోకలను అడ్డుకున్నారు.

గ్రామంలో గాలి, నీరు కలుషితమవుతోందని, పరిశ్రమ నుంచి దుర్వాసన వస్తోందని గ్రామస్థుల ఆరోపించారు. రసాయన పరిశ్రమ వల్ల పంటలు కూడా సరిగా పండటం లేదని వాపోయారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని తెలిపారు. గ్రామం నుంచి కంపెనీని తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ప్రమాదస్థలిని నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు పరిశీలించారు. అనంతరం గ్రామస్థులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనటంతో.. పోలీసులు బందోబస్తు చేపట్టారు.

సంబంధిత కథనాలు:

ఏలూరు జిల్లా: రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

అక్కిరెడ్డిగూడెంలో పరిశ్రమ సిబ్బంది, స్థానికుల ఆందోళన

Protest at akkireddygudem: ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం గ్రామ శివారులో.. పోరస్​ పరిశ్రమ సిబ్బంది, స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటన జరిగిన పోరస్ పరిశ్రమలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా.. పరిశ్రమ ముందు బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా ముళ్లకంపలు వేసి రాకపోకలను అడ్డుకున్నారు.

గ్రామంలో గాలి, నీరు కలుషితమవుతోందని, పరిశ్రమ నుంచి దుర్వాసన వస్తోందని గ్రామస్థుల ఆరోపించారు. రసాయన పరిశ్రమ వల్ల పంటలు కూడా సరిగా పండటం లేదని వాపోయారు. గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని తెలిపారు. గ్రామం నుంచి కంపెనీని తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ప్రమాదస్థలిని నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు పరిశీలించారు. అనంతరం గ్రామస్థులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనటంతో.. పోలీసులు బందోబస్తు చేపట్టారు.

సంబంధిత కథనాలు:

ఏలూరు జిల్లా: రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.