ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీ తీరుపై ఆందోళన.. అధికార పార్టీ నేతల మద్దతు - అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించిన వైకాపా శ్రేణులు

అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి అర్హులను విస్మరించారని పేర్కొంటూ.. తూర్పుగోదావరి జిల్లా మురారిలో గ్రామస్థులతో కలిసి.. ఏకంగా అధికార పార్టీ నాయకులే బైఠాయించారు. జాతీయ రహదారిపై బైఠాయించారు.

ఇళ్ల పట్టాల పంపిణీ తీరుపై ఆందోళన
అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించిన వైకాపా శ్రేణులు
author img

By

Published : Dec 26, 2020, 9:51 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు, అధికారులు ప్రారంభించారు. అయితే కొన్నిచోట్ల లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామస్తులు.. తమకు దక్కిన ఇళ్ల స్థలాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార వైకాపా శ్రేణులతో కలిసి లబ్ధిదారులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆందోళన చేశారు.

అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి అర్హులను విస్మరించారని పేర్కొన్నారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నిరసన విరమింపజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు, అధికారులు ప్రారంభించారు. అయితే కొన్నిచోట్ల లబ్ధిదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామస్తులు.. తమకు దక్కిన ఇళ్ల స్థలాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార వైకాపా శ్రేణులతో కలిసి లబ్ధిదారులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆందోళన చేశారు.

అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి అర్హులను విస్మరించారని పేర్కొన్నారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నిరసన విరమింపజేశారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో పండుగలా ఇళ్ల పట్టాల పంపిణీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.