కరోనా అంతమవ్వాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ చేపట్టిన యాగం రెండో రోజుకు చేరింది. రెండో రోజు ధన్వంతరీ సహిత సుదర్శన యాగం, రాజశ్యామల మహారుద్రాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేందుకు.. కొవిడ్ మహమ్మారి సమూలంగా పోవాలని కోరుకుంటూ యాగం నిర్వహించినట్లు ఎంపీ చెప్పారు. రేపు పూర్ణాహుతి కార్యక్రమంతో పాటు అన్నదానం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి... కొత్తలంకలో 5 కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు