తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలంలోని చాలా గ్రామాల ప్రజలు తాగునీరు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు భూగర్భజలాలు ఇంకిపోవడం.. చేతిపంపులు మొరాయించడం.. బావులు ఎండిపోవడం.. కుళాయిలు రాకపోవటం.. విద్యుత్ అంతరాయం ఇలా అనేక రూపాలలో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నారు. మండలంలోని ఉపప్రణాళిక ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణం. ఈ ప్రాంతంలోని కొండపల్లి, బురదకోట, బాపన్నదొర, కే. మిర్తివాడ తండాలలో మంచినీరు కావాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. కొంతమంది అంతదూరం వెళ్లలేక వాగులలో నీటిని తాగుతున్నారు.
మండలంలోని ఒమ్మంగి, ధర్మవరం, శరభవరం, గజ్జనాపూడి, ప్రతిపాడు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా తమ తాగునీటి ఇక్కట్లు తీర్చాలని వారు కోరారు. ఇటీవల ఈ తండాలలో టెక్సాస్కు చెందిన ఇద్దరు అమెరికన్లు పర్యటించారు. అక్కడి పరిస్థితి చూసి చలించి.. గ్రామస్థుల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఇవీ చదవండి..