ఆదివాసీల ప్రథమ పౌరుడు వాల్మీకి మహర్షి అని రంపచోడవరం మాజీ ఎంపీపీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం పెద గెడ్డాడ గ్రామంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్యనారాయణ రెడ్డితో పాటు ఆదివాసీ పెద్దలు మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: