ETV Bharat / state

అమరావతికి మద్దతుగా రాజమహేంద్రవరంలో తెదేపా దీక్ష - తూర్పు గోదావరిలో తెదేపా నిరసన

అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

Tdp protest in Rajahmundry in support of Amravati
అమరావతికి మద్దతుగా రాజమహేంద్రవరంలో తెదేపా దీక్ష
author img

By

Published : Aug 24, 2020, 3:28 PM IST

రాజధాని రైతుల అవిశ్రాంత పోరాటానికి ఊరూవాడా మద్దతు వెల్లువెత్తుతోంది. రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

రాజధానుల విధానాన్ని ప్రభుత్వం నిరంకుశంగా తీసుకొస్తోందని గోరంట్ల ఆరోపించారు. కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని కోరుతూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఈ సందర్బంగా మూడు రాజధానులు వద్దు- అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.

రాజధాని రైతుల అవిశ్రాంత పోరాటానికి ఊరూవాడా మద్దతు వెల్లువెత్తుతోంది. రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

రాజధానుల విధానాన్ని ప్రభుత్వం నిరంకుశంగా తీసుకొస్తోందని గోరంట్ల ఆరోపించారు. కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని కోరుతూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఈ సందర్బంగా మూడు రాజధానులు వద్దు- అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ కరోనా వ్యాప్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.