వైద్యుడు సుధాకర్పై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా నర్సీపట్నంలో తెదేపా నాయకులు 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. పత్తిపాడు తెదేపా ఆధ్వర్యంలో దళితులు నిరసన వ్యక్తం చేశారు. దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యహరిస్తోందని మండిపడ్డారు. డాక్టర్పై సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: విశాఖలో దారుణం..డాక్టర్ను కట్టేసి పోలీస్స్టేషన్కు తరలింపు