ETV Bharat / state

స్థానికుడి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం..రోడ్డుకు మరమ్మతులు

author img

By

Published : Mar 27, 2021, 8:32 PM IST

మండపేట రహదారిపై ప్రయాణమంటేనే నరకాన్ని తలపిస్తోంది. ఆ మార్గంలో కేవలం 7 కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి వాహనదారులు అనేక అవస్థలు పడుతుంటారు. దీంతో ఆ రహదారిని బాగు చేయాలని అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. అయితే ఈ దుస్థితిపై స్థానికుడు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం.. అక్కడినుంచి స్పందన రావడంలో మరమ్మతులు ఆఘమేఘాల మీద కొనసాగుతున్నాయి.

మండపేట రహదారికి మరమ్మతులు
మండపేట రహదారికి మరమ్మతులు
మండపేట రహదారికి మరమ్మతులు

తూర్పుగోదావరి జిల్లా మండపేట-ద్వారపూడి మధ్య ఉన్న రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. జడ్. మేడపాడు, తాపేశ్వరం మీదుగా మండపేట వెళ్లే ఈ రహదారి తీవ్రంగా దెబ్బతింది. గోతులు, గుంతలతో ప్రయాణానికి ఏ మాత్రం అనువుగా లేదు. తీవ్రంగా ధ్వంసమైన రహదారికి మరమ్మతులు చేయాలని స్థానికులు అనేకసార్లు అధికారులకు మొర పెట్టుకున్నారు. అయినా ఎలాంటి పనులు జరగలేదు.

మండపేటకు చెందిన మూర్తి.. రోడ్డు దుస్థితిపై ఈ నెల 17న మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. స్పందించిన రాష్ట్రపతి కార్యాలయ అధికారులు.. మూర్తికి ఫోన్​ చేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యదర్శి జనార్దనబాబుకు పంపించారు. దీంతో శుక్రవారం రహదారి మరమతులను అధికారులు ఆఘమేఘాల మీద చేపట్టారు.

కేవలం 7 కిలోమీటర్ల రహదారి మరమ్మతులు నెలల తరబడి నోచుకోలేదని.. రాష్ట్రపతి కార్యాలయం చొరవతో రహదారి పనులకు మోక్షం లభించిందని స్థానికులంటున్నారు. సమస్యను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన మూర్తిని అభినందిస్తున్నారు.

ఇదీచూడండి:

కరోనా టీకాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: హోంమంత్రి

మండపేట రహదారికి మరమ్మతులు

తూర్పుగోదావరి జిల్లా మండపేట-ద్వారపూడి మధ్య ఉన్న రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. జడ్. మేడపాడు, తాపేశ్వరం మీదుగా మండపేట వెళ్లే ఈ రహదారి తీవ్రంగా దెబ్బతింది. గోతులు, గుంతలతో ప్రయాణానికి ఏ మాత్రం అనువుగా లేదు. తీవ్రంగా ధ్వంసమైన రహదారికి మరమ్మతులు చేయాలని స్థానికులు అనేకసార్లు అధికారులకు మొర పెట్టుకున్నారు. అయినా ఎలాంటి పనులు జరగలేదు.

మండపేటకు చెందిన మూర్తి.. రోడ్డు దుస్థితిపై ఈ నెల 17న మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. స్పందించిన రాష్ట్రపతి కార్యాలయ అధికారులు.. మూర్తికి ఫోన్​ చేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యదర్శి జనార్దనబాబుకు పంపించారు. దీంతో శుక్రవారం రహదారి మరమతులను అధికారులు ఆఘమేఘాల మీద చేపట్టారు.

కేవలం 7 కిలోమీటర్ల రహదారి మరమ్మతులు నెలల తరబడి నోచుకోలేదని.. రాష్ట్రపతి కార్యాలయం చొరవతో రహదారి పనులకు మోక్షం లభించిందని స్థానికులంటున్నారు. సమస్యను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన మూర్తిని అభినందిస్తున్నారు.

ఇదీచూడండి:

కరోనా టీకాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.