ETV Bharat / state

జిల్లాలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ.. కలెక్టర్ పరిశీలన

author img

By

Published : Jan 30, 2021, 10:29 AM IST

తూర్పు గోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో తొలి దశ ఎన్నికలు జరుగనుండటంతో.. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు నామినేషన్లను దాఖలు చేశారు. వివిధ చోట్ల నామినేషన్ల స్వీకరణను కలెక్టర్ మురళీధర్, జేసీ కీర్తి చేకూరి పరిశీలించారు.

nominations process has began for panchayat elections in east godavari district
జిల్లాలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. కలెక్టర్ పరిశీలన

తూర్పు గోదావరి జిల్లాలో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. కాకినాడ డివిజన్​లో.. 84 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వార్డ్ మెంబర్లుగా.. 163 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

పెద్దాపురం డివిజన్​లో సర్పంచ్​లుగా 164 మంది, వార్డ్ మెంబర్లుగా 485 మంది నామినేషన్లు వేశారు. వివిధ చోట్ల కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జేసీ కీర్తి చేకూరి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా.. ఆయా కేంద్రాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. కాకినాడ, పెద్దాపురం డివిజన్లలో తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. కాకినాడ డివిజన్​లో.. 84 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వార్డ్ మెంబర్లుగా.. 163 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

పెద్దాపురం డివిజన్​లో సర్పంచ్​లుగా 164 మంది, వార్డ్ మెంబర్లుగా 485 మంది నామినేషన్లు వేశారు. వివిధ చోట్ల కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జేసీ కీర్తి చేకూరి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా.. ఆయా కేంద్రాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

ఇదీ చదవండి:

పంచాయతీ పోరు: తొలిరోజు 1,315 నామినేషన్లు దాఖలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.