ETV Bharat / state

యానాం అసెంబ్లీ స్థానానికి ముగిసిన నామినేషన్ల స్వీకరణ

author img

By

Published : Mar 19, 2021, 7:52 PM IST

కేంద్రపాలిత ప్రాంతం యానాం అసెంబ్లీ స్థానానికి నేటితో నామినేషన్ గడువు ముగిసింది. చివరిరోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా... మొత్తం 22 మంది నామపత్రాలు దాఖలు చేశారు.

nomination process completed for Yanam Assembly seat in east godavari district
యానాం అసెంబ్లీ స్థానానికి ముగిసిన నామినేషన్ల స్వీకరణ

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసింది. ఇందులో భాగంగా యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇవాళ 11మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. వీరిలో పుదుచ్చేరి రాష్ట్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి నామినేషన్ వేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. చివరి అరగంట సమయంలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. గత శుక్రవారం ప్రారంభమై ఈ శుక్రవారం వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో 22 మంది అభ్యర్థులు నామ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. శనివారం నామపత్రాల పరిశీలన, ఆది, సోమవారాల్లో నామపత్రాల ఉపసంహరణ గడువుగా ఎన్నికల నిర్వహణ అధికారి ప్రకటించారు.

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసింది. ఇందులో భాగంగా యానాం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇవాళ 11మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. వీరిలో పుదుచ్చేరి రాష్ట్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి నామినేషన్ వేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. చివరి అరగంట సమయంలో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. గత శుక్రవారం ప్రారంభమై ఈ శుక్రవారం వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో 22 మంది అభ్యర్థులు నామ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. శనివారం నామపత్రాల పరిశీలన, ఆది, సోమవారాల్లో నామపత్రాల ఉపసంహరణ గడువుగా ఎన్నికల నిర్వహణ అధికారి ప్రకటించారు.

ఇదీచదవండి. రాష్ట్రంలో కొత్తగా 246కరోనా కేసులు, ఒక మరణం నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.