తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. నాడు-నేడు పనులపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పి.రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 16న.. సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో.. నాడు-నేడు పనులను రాజశేఖర్ పరిశీలించారు. 65 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని.. టైల్స్ నాణ్యతగా లేవని, మార్చాలని ఆదేశించారు.
రంగులు కూడా నాణ్యతగా లేవంటూ.. ఇంజనీరింగ్ అధికారులపై రుసరుసలాడారు. కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ కీర్తి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. రాజశేఖర్ వెంట ఉన్నారు.
ఇదీ చదవండీ.. CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,869 కరోనా కేసులు..18 మరణాలు