ETV Bharat / state

తప్పిపోయిన బాలుడిని తండ్రి వద్దకు చేర్చిన పోలీసులు

author img

By

Published : Aug 30, 2020, 12:34 AM IST

తప్పిపోయిన కుమారుడిని పోలీసులు తండ్రికి అప్పగించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పందలపాకలో జరిగింది. 3 రోజుల క్రితం ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి తప్పిపోగా.. నేడు అతడిని తండ్రి ఒడికి చేర్చారు పోలీసులు.

missing boy traceout in pandalapaka east godavari district
తప్పిపోయిన బాలుడిని తండ్రి వద్దకు చేర్చిన పోలీసులు

తప్పిపోయిన బాలుడిని పోలీసులు తండ్రికి అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన నల్లమిల్లి రామిరెడ్డి కుమారుడు సాయి వెంకటరెడ్డి.. ఈనెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతను ఆరో తరగతి చదువుతున్నాడు. అప్పటినుంచి విద్యార్థి తండ్రి పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం రాత్రి పి. గన్నవరంలో ఒక బాలుడు స్థానికులకు కనిపించటంతో పోలీసులకు అప్పగించారు. ఎస్సై సురేంద్ర అనపర్తి పోలీసులకు సమాచారం అందించి వివరాలు సేకరించారు. రామిరెడ్డి కుమారుడిగా గుర్తించి విద్యార్థిని తండ్రికి అప్పగించారు.

ఇవీ చదవండి..

తప్పిపోయిన బాలుడిని పోలీసులు తండ్రికి అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన నల్లమిల్లి రామిరెడ్డి కుమారుడు సాయి వెంకటరెడ్డి.. ఈనెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతను ఆరో తరగతి చదువుతున్నాడు. అప్పటినుంచి విద్యార్థి తండ్రి పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం రాత్రి పి. గన్నవరంలో ఒక బాలుడు స్థానికులకు కనిపించటంతో పోలీసులకు అప్పగించారు. ఎస్సై సురేంద్ర అనపర్తి పోలీసులకు సమాచారం అందించి వివరాలు సేకరించారు. రామిరెడ్డి కుమారుడిగా గుర్తించి విద్యార్థిని తండ్రికి అప్పగించారు.

ఇవీ చదవండి..

'మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.