తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం వెంకటనగరంలో 'మనం-మన పరిశుభ్రత' పేరుతో పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని..కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి.. ఎరువు తయారు చేసి రైతులకు అందిస్తామన్నారు.
పారిశుద్ధ్య పరిరక్షణను గ్రామస్తులు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. గ్రామాల్ని వ్యర్థ రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వెంకటనగరం, బొమ్మూరు గ్రామాల్ని పైలట్ ప్రాజెక్ట్ లుగా ఎంపిక చేసినట్టు చెప్పారు. మాజీ సర్పంచ్ సత్యనారాయణ లక్ష రూపాయల విరాళాన్ని అందించారు.
ఇదీ చూడండి: