ETV Bharat / state

కాకినాడ ఎమ్మెల్యే పేరుతో ఫేస్​బుక్ నకిలీ ఖాతా.. ఎస్పీకి ఫిర్యాదు

సైబర్​ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. ఏదో ఒక కారణం చెప్పి.. నగదు కావాలంటూ సందేశాలు పంపిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సైతం ఈ సమస్య ఎదురవుతోంది. ఎమ్మెల్యే పేరుతో నకిలీ అకౌంట్​ తెరిచి మనీ డిమాండ్​ చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.

author img

By

Published : Mar 16, 2021, 7:39 AM IST

kakinada mla
కాకినాడ ఎమ్మెల్యే

సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​లో.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో నకిలీ ఖాతా తెరిచారు.. సైబర్ నేరగాళ్లు. ఆ ఖాతా నుంచి.. ఎమ్మెల్యే పేరుతో ఇతరులకు సందేశాలు పంపించారు. రూ. 15 వేలు డిపాజిట్ చేయాలంటూ మెసేజ్​లు పంపారు.

ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ద్వారంపూడి.. జిల్లా ఎస్పీ నయీం అద్నాం అస్మీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ రెండవ పట్టణ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​లో.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో నకిలీ ఖాతా తెరిచారు.. సైబర్ నేరగాళ్లు. ఆ ఖాతా నుంచి.. ఎమ్మెల్యే పేరుతో ఇతరులకు సందేశాలు పంపించారు. రూ. 15 వేలు డిపాజిట్ చేయాలంటూ మెసేజ్​లు పంపారు.

ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ద్వారంపూడి.. జిల్లా ఎస్పీ నయీం అద్నాం అస్మీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాకినాడ రెండవ పట్టణ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు.. నియమాలు పాటించని ఆటోల సీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.