తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్న పాలెంలో ఏలేరు నీటి ఉద్ధృతికి దెబ్బతిన్న కాజ్ వే వంతెనను మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలను అనుసంధానం చేసే ఈ వంతెన కుంగిపోవడంతో మర్రిపాక, ఇర్రిపాక, మామిడాడ, నరేంద్రపట్నం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జ్యోతుల, తెలుగు యువత ఉపాధ్యక్షులు పైలా బోస్ కలసి పరిశీలించారు. నీటి ఉద్ధృతి తగ్గిన వెంటనే వంతెన మరమ్మతు పనులను చేపట్టాలని నెహ్రూ డిమాండ్ చేసారు.
ఇదీ చదవండి: ఉద్ధృతంగా వరద ప్రవాహం.. ప్రాజెక్టులకు జలకళ