అక్రమ మద్యం (Illegal liquor) పట్టివేత కేసులో రూ. 20 వేలు లంచం (Bribe) తీసుకొని నిందితులను వదిలేశారన్న అభియోగంపై (Allegation) తూర్పుగోదావరి జిల్లా గొల్లపాలెం ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్పై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఎస్పీ రవీంద్రబాబు (SP Ravindra Babu) ఆదేశాల మేరకు ఎస్ఐ (SI) పవన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ (Head Constable) భీమ శంకర్లను స్పెషల్ బ్రాంచ్ (Special branch) అధికారులు విచారించారు.
ఏం జరిగిందంటే..
ఈ నెల 3న కాజులూరుకు చెందిన కమిడి వీరేంద్ర, భాను ప్రకాశ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమ మద్యం విక్రయిస్తున్నారని గొల్లపాలెం పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. పోలీసు స్టేషన్లో (Police Station) విచారణ అనంతరం నిందితుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకొని వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కాజులూరుకు చెందిన వంగా శ్రీనివాస్, పెంకే రవితేజ, కనుమూరి సతీశ్లు ఈ నెల 6న స్పందన (Spandana) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గొల్లపాలెం పోలీసు స్టేషన్ సెటిల్మెంట్లకు (settlements) అడ్డాగా మారిందని ఎస్ఐ పవన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భీమ శంకర్లపై చర్యలు (Action) తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు (Written Complaint) చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ రవీంద్ర బాబు..గొల్లపాలెం ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్లపై విచారణ చేపట్టాలని ఎస్బీ సీఐ (SB CI) సత్యనారాయణను ఆదేశించారు. ఈ మేరకు ఎస్బీ పోలీసులు విచారణ (Enquiry) చేపట్టారు. విచారణ అనంతరం నివేదికను (Report) ఎస్పీకి అందజేస్తామని ఎస్బీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి
Fake Challans: నకిలీ చలాన్ల వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం