నివాసయోగ్యమైన స్థలాలు కేటాయించాలని.. పనికిరాని స్థలాలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని.. గుండేపల్లి మండలం ఉప్పలపాడు ప్రజలు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కలెక్టర్ కార్యాలయం ఎదుటు ధర్నా నిర్వహించారు. పోలవరం కాలువ గట్టున తవ్వి మట్టి పోసిన దగ్గర 140 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని.. ఆందోళన వ్యక్తం చేశారు. మరో ప్రాంతంలో భూములు సేకరించి స్థలాలు కేటాయించాలని కోరారు.
ఇదీ చదవండి: