ETV Bharat / state

జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు

author img

By

Published : Aug 22, 2020, 10:13 AM IST

గోదావరి వరదకు లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడంతో దిక్కుతోచని స్థితిలో లంక గ్రామాల ప్రజలు ఉన్నారు. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు కూడా సరైన ఏర్పాట్లు కల్పించలేదంటూ వాపోతున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లడంతో రైతులు నిరాశ నిస్పృహల్లో మునిగారు.

Godavari surrounds Konaseema Lanka villages in East Godavari district with heavy rains.
లంక గ్రామాలను చుట్టుముట్టిన గోదారి

అధిక వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ లంక గ్రామాలను గోదావరి చుట్టుముట్టింది. కోనసీమలోని 64 గ్రామాలు వరద ప్రభావానకి గురయ్యాయి. ఇళ్లలోకి వరద చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పూరిళ్లు, పశువుల పాకలు నేలకూలాయి. సురక్షిత ప్రాంతాల నుంచి గ్రామాలకు చేరుకున్న ప్రజలు... ధ్వంసమైన ఇళ్లను చూసి ఆవేదన చెందుతున్నారు. పలుచోట్ల రోడ్లపై గుడారాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాజ్‌వేలపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. వారం రోజులుగా వరద నీటిలోనే పడరాని పాట్లు పడుతున్నారు..

లంక గ్రామాలను చుట్టుముట్టిన గోదారి

పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉన్న ప్రజలకు నిత్యావసరాలు కరవయ్యాయి. ఎక్కడికక్కడ చిక్కుకున్న మూగజీవాలు పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా పరిస్థితులు కుదుటపడకపోవడంతో ప్రాణాలకు తెగించి ప్రైవేటు పడవల్లో నిత్యావసరాలు, పశుగ్రాసం కోసం బయట ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా భయంతో పునరావాస కేంద్రాలకు వెళ్లని వారంతా ముంపు చుట్టుముట్టినా నివాసాల్లోనే ఉన్నారు. అధికారులు నీరు మాత్రమే అందిస్తున్నారని.... ఆహారం, నిత్యావసరాల కోసం ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడవలు ఏర్పాటు చేసినా.... అవి ఏ మాత్రం చాలడం లేదంటున్నారు.

గతంలో..వరద ముప్పు పొంచి ఉంటే..అధికారులు ముందస్తుగా సమాచారం ఇచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేకనే.... అవస్థలు మరింత పెరిగాయంటున్నారు. అధికారులు మాత్రం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. మండలంలో ప్రజా రవాణా కోసం 30 పడవలు ఏర్పాటు చేశామన్నారు.

వేలాది ఎకరాల్లో పంట నష్టం..

గోదావరి వరద రైతులను తీవ్రంగా దెబ్బకొట్టింది. అనేక గ్రామాల్లో ఇప్పటికీ పంటలు వరద నీటిలోనే ఉండిపోయాయి. కళ్ల ముందే కుళ్లిపోతున్న పంటను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులకు ఒక్క రూపాయి కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు సహా పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కాస్తోకూస్తో మిగిలిన పంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెడుతున్నారు.

పంట చేతికందే సమయంలో..వరద రూపంలో ప్రకృతి తమ ఆశలపై గండి కొట్టిందని రైతులు వాపోతున్నారు. పరిహారమిచ్చి ప్రభుత్వమే తమను అప్పుల ఊబిలో నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. పరిహారం లెక్కలను కాగితాలకే పరిమితం చేయకుండా... త్వరగా చేతికందించాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి: తగ్గని వరద.. జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు

అధిక వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ లంక గ్రామాలను గోదావరి చుట్టుముట్టింది. కోనసీమలోని 64 గ్రామాలు వరద ప్రభావానకి గురయ్యాయి. ఇళ్లలోకి వరద చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పూరిళ్లు, పశువుల పాకలు నేలకూలాయి. సురక్షిత ప్రాంతాల నుంచి గ్రామాలకు చేరుకున్న ప్రజలు... ధ్వంసమైన ఇళ్లను చూసి ఆవేదన చెందుతున్నారు. పలుచోట్ల రోడ్లపై గుడారాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాజ్‌వేలపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. వారం రోజులుగా వరద నీటిలోనే పడరాని పాట్లు పడుతున్నారు..

లంక గ్రామాలను చుట్టుముట్టిన గోదారి

పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉన్న ప్రజలకు నిత్యావసరాలు కరవయ్యాయి. ఎక్కడికక్కడ చిక్కుకున్న మూగజీవాలు పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా పరిస్థితులు కుదుటపడకపోవడంతో ప్రాణాలకు తెగించి ప్రైవేటు పడవల్లో నిత్యావసరాలు, పశుగ్రాసం కోసం బయట ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా భయంతో పునరావాస కేంద్రాలకు వెళ్లని వారంతా ముంపు చుట్టుముట్టినా నివాసాల్లోనే ఉన్నారు. అధికారులు నీరు మాత్రమే అందిస్తున్నారని.... ఆహారం, నిత్యావసరాల కోసం ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడవలు ఏర్పాటు చేసినా.... అవి ఏ మాత్రం చాలడం లేదంటున్నారు.

గతంలో..వరద ముప్పు పొంచి ఉంటే..అధికారులు ముందస్తుగా సమాచారం ఇచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేకనే.... అవస్థలు మరింత పెరిగాయంటున్నారు. అధికారులు మాత్రం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. మండలంలో ప్రజా రవాణా కోసం 30 పడవలు ఏర్పాటు చేశామన్నారు.

వేలాది ఎకరాల్లో పంట నష్టం..

గోదావరి వరద రైతులను తీవ్రంగా దెబ్బకొట్టింది. అనేక గ్రామాల్లో ఇప్పటికీ పంటలు వరద నీటిలోనే ఉండిపోయాయి. కళ్ల ముందే కుళ్లిపోతున్న పంటను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులకు ఒక్క రూపాయి కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు సహా పలు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కాస్తోకూస్తో మిగిలిన పంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెడుతున్నారు.

పంట చేతికందే సమయంలో..వరద రూపంలో ప్రకృతి తమ ఆశలపై గండి కొట్టిందని రైతులు వాపోతున్నారు. పరిహారమిచ్చి ప్రభుత్వమే తమను అప్పుల ఊబిలో నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. పరిహారం లెక్కలను కాగితాలకే పరిమితం చేయకుండా... త్వరగా చేతికందించాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి: తగ్గని వరద.. జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.