ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 25 కిలోల బియ్యంతో పాటు మొత్తం ఆరు రకాల సరకులు అందించాలని అధికారులకు స్పష్టంచేసింది. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గోదావరి వరదల కారణంగా వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచిత రేషన్ అందించాలని పేర్కొంది.
ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచిత రేషన్
ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచితంగా 25 కిలోల బియ్యం, ఆరు రకాల సరకులు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లో ఉచిత రేషన్ అందించాలని ఉత్తర్వులు ఇచ్చింది.
![ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచిత రేషన్ ఉభయగోదావరి జిల్లాల వరద బాధితులకు ఉచిత రేషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8544658-1014-8544658-1598296985742.jpg?imwidth=3840)
వరదముంపులో చిక్కుకున్న కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రభుత్వం రెండు వేల రూపాయల ఆర్థకసాయాన్ని ప్రకటించింది. త్వరితగతిన బాధితులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : వృత్తి పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 25 కిలోల బియ్యంతో పాటు మొత్తం ఆరు రకాల సరకులు అందించాలని అధికారులకు స్పష్టంచేసింది. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గోదావరి వరదల కారణంగా వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచిత రేషన్ అందించాలని పేర్కొంది.
వరదముంపులో చిక్కుకున్న కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రభుత్వం రెండు వేల రూపాయల ఆర్థకసాయాన్ని ప్రకటించింది. త్వరితగతిన బాధితులను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : వృత్తి పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు