తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కాస్త వర్షాలు తగ్గాయి. ఉదయం నుంచి ఎండగా ఉండటం వల్ల రైతులు పొలం పనుల్లో మునిగిపోయారు. తడిసిపోయిన ధాన్యం ఆరబెట్టేందుకు కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన కొద్దిపాటి పంటను కాపాడుకునే ప్రయత్నిస్తున్నారు. నేలనంటిన వరిని పైకి నిలబెడుతున్నారు. సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పూర్తిగా దెబ్బతింది. పొలాల మధ్య ఉన్న కోసిన పంటను సురక్షిత ప్రదేశానికి తరలించి ఎండ పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: