ETV Bharat / state

ఎస్పీ గారు... అతన్ని ఎన్​కౌంటర్ చేసేయండి: హర్షకుమార్

author img

By

Published : Nov 30, 2020, 10:47 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి కుటుంబసభ్యులను మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత హర్షకుమార్ పరామర్శించారు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ex mp harsha kumar
ex mp harsha kumar

మీడియా సమావేశంలో హర్షకుమార్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎన్​కౌంటర్ చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు హర్షకుమార్ జిల్లా ఎస్పీని కోరారు. సభ్య సమాజం సిగ్గు పడేలా ముక్కుపచ్చలారని బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్​లో బాలిక కుటుంబ సభ్యులను హర్షకుమార్ సోమవారం పరామర్శించారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో హర్షకుమార్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎన్​కౌంటర్ చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు హర్షకుమార్ జిల్లా ఎస్పీని కోరారు. సభ్య సమాజం సిగ్గు పడేలా ముక్కుపచ్చలారని బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్​లో బాలిక కుటుంబ సభ్యులను హర్షకుమార్ సోమవారం పరామర్శించారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి

కాకినాడలో దారుణం... నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.