తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల్లో రెడ్జోన్లు ఏర్పాటు చేశారు. ఈ మండలంలోని మాచవరం, పుల్లేటికుర్రు, ఇసుక పూడి గ్రామాలలో మొత్తం ఈ రోజు వరకు 8 కేసులు బయటపడ్డాయి. దీంతో ఆయా గ్రామాల పరిధిలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రెడ్జోన్లు ఆంక్షలు ప్రకటించారు. అంబాజీపేటలో బుధవారం జరిగే వారపు సంత, పశువుల సంతను రద్దు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు.
ఇదీ చూడండి. కరోనాతో కుమారుడు... కలతతో తండ్రి మృతి... అంత్యక్రియలు చేసింది ఖాఖీ.!