తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు రూ.1,01,116ను విరాళంగా అందించారు. ఈ డబ్బును అన్న ప్రసాద ట్రస్ట్కు వినియోగించాలని ఆయన కోరారు. ఆలయ నిర్వాహకులు దాతకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు ఇచ్చి సత్కరించారు.