ETV Bharat / state

కోవిడ్ కేంద్రాలు అడ్డుకుంటే చర్యలు: కలెక్టర్ మురళీధర్ రెడ్డి - బోడసకుర్రు కోవిడ్ కేర్ సెంటర్ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని బోడసకుర్రులోని కోవిడ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అమలాపురం డివిజన్​లో నమోదైన కరోనా బాధితులకు ఇక్కడ చికిత్స అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Collector muralidhar reddy  visited the covid care center in bodasakurru
బోడసకుర్రు కోవిడ్ కేర్ సెంటర్​ని పరిశీలించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి
author img

By

Published : Jul 1, 2020, 4:36 PM IST

తూర్పుగోదావరి జిల్లా బోడసకుర్రులోని కోవిడ్ కేర్ సెంటర్​ను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ కేంద్రంలో 1500 నుంచి 2000 వరకు పడకలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. అమలాపురం డివిజన్​లో నమోదైన కరోనా బాధితులకు ఇక్కడ చికిత్స అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఆయనతోపాటే అమలాపురం ఆర్డీవో బి. హెచ్ భవాని శంకర్ గదులను పరిశీలించారు.

తూర్పుగోదావరి జిల్లా బోడసకుర్రులోని కోవిడ్ కేర్ సెంటర్​ను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ కేంద్రంలో 1500 నుంచి 2000 వరకు పడకలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. అమలాపురం డివిజన్​లో నమోదైన కరోనా బాధితులకు ఇక్కడ చికిత్స అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఆయనతోపాటే అమలాపురం ఆర్డీవో బి. హెచ్ భవాని శంకర్ గదులను పరిశీలించారు.

ఇదీ చూడండి. ఉరవకొండలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.