ETV Bharat / state

దాతల ఔదర్యం.. వారికి రాజమహేంద్రవరంలో రాత్రి పూట భోజనం! - రాజమహేంద్రవరం స్వచ్ఛంద సంస్థలు న్యూస్

కొవిడ్ సమయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి. కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలు, బాటసారులు, కూలీలకు ఆహారాన్ని అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు, దాతలు ఉదయం మాత్రమే సేవ చేస్తుంటే... రాజమహేంద్రవరంలో మాత్రం ఓ సంస్థ రాత్రి పూట కూడా ఆహారం అందించి.. సేవా స్ఫూర్తిని చాటుకుంటోంది.

దాతల ఔదర్యం.. రాజమహేంద్రవరంలో రాత్రి పూట భోజనం
దాతల ఔదర్యం.. రాజమహేంద్రవరంలో రాత్రి పూట భోజనం
author img

By

Published : Jun 6, 2021, 7:59 AM IST

దాతల ఔదర్యం.. వారికి రాజమహేంద్రవరంలో రాత్రి పూట భోజనం

కొవిడ్‌తో ఉపాధి కోల్పోయిన నిరు పేదల జీవనం దుర్లభంగా మారింది. ఒంటరిగా నివసించే వారికి ఆహారం దొరకడమే కష్టమవుతోంది. లాక్ డౌన్ తో దాతలు మధ్యాహ్నం వరకే ఆహారం పంపిణీ చేస్తున్నారు. రాత్రి భోజనం దొరక్క చాలా మంది పస్తులు ఉంటున్నారు. ఇలాంటి వారి అవసరం గుర్తించి రాజమహేంద్రవరంలో సాయి మహేంద్ర ట్రేడర్స్ ఆధ్వర్యంలో రాత్రి పూట కూడా భోజనం అందిస్తున్నారు.

వలస కూలీలు, హెల్స్ వర్కర్లకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గోదావరి గట్టుతోపాటు నగరంలోని వివిధ కూడళ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిత్యం 500 మందికి పైగా భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు.

కరోనా రెండో దశలో తక్కువ మంది దాతలు మాత్రమే ఆహారం అందిస్తుండగా.. రాత్రి పూట భోజనంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. సాయి మహేంద్ర ట్రేడర్స్ తో కలిసి కొల్లివెలిస హారిక ఆపదలో పేదల ఆకలి తీర్చుతూ అన్నపూర్ణగా మారారు.

ఇదీ చదవండి:

Anandaiah Medicine: రేపటి నుంచే ఆనందయ్య మందు పంపిణీ.. ముందుగా అక్కడే..!

దాతల ఔదర్యం.. వారికి రాజమహేంద్రవరంలో రాత్రి పూట భోజనం

కొవిడ్‌తో ఉపాధి కోల్పోయిన నిరు పేదల జీవనం దుర్లభంగా మారింది. ఒంటరిగా నివసించే వారికి ఆహారం దొరకడమే కష్టమవుతోంది. లాక్ డౌన్ తో దాతలు మధ్యాహ్నం వరకే ఆహారం పంపిణీ చేస్తున్నారు. రాత్రి భోజనం దొరక్క చాలా మంది పస్తులు ఉంటున్నారు. ఇలాంటి వారి అవసరం గుర్తించి రాజమహేంద్రవరంలో సాయి మహేంద్ర ట్రేడర్స్ ఆధ్వర్యంలో రాత్రి పూట కూడా భోజనం అందిస్తున్నారు.

వలస కూలీలు, హెల్స్ వర్కర్లకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గోదావరి గట్టుతోపాటు నగరంలోని వివిధ కూడళ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిత్యం 500 మందికి పైగా భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు.

కరోనా రెండో దశలో తక్కువ మంది దాతలు మాత్రమే ఆహారం అందిస్తుండగా.. రాత్రి పూట భోజనంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. సాయి మహేంద్ర ట్రేడర్స్ తో కలిసి కొల్లివెలిస హారిక ఆపదలో పేదల ఆకలి తీర్చుతూ అన్నపూర్ణగా మారారు.

ఇదీ చదవండి:

Anandaiah Medicine: రేపటి నుంచే ఆనందయ్య మందు పంపిణీ.. ముందుగా అక్కడే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.