ETV Bharat / state

కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం - burnt dead body found news

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్త వెలంపేట శివారులో దహనమైన గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

burnt dead body found
కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం
author img

By

Published : Feb 28, 2021, 2:56 PM IST

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవకొత్తూరు వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కొత్త వెలంపేట శివారులో ఉన్న తోటలో దహనమై ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి కాల్చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతిచెందిన మహిళ ఎవరు, ఏ ప్రాంతానికి చెందినది, ఘటన ఎలా జరిగింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవకొత్తూరు వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కొత్త వెలంపేట శివారులో ఉన్న తోటలో దహనమై ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి కాల్చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతిచెందిన మహిళ ఎవరు, ఏ ప్రాంతానికి చెందినది, ఘటన ఎలా జరిగింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: కురుగుంటలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.