ETV Bharat / state

కిడ్నాపర్లు భయపడ్డారు... చిన్నారిని వదిలేశారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ కిడ్నాపర్ల బారి నుంచి క్షేమంగా బయటపడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు వద్ద ఇవాళ తెల్లవారుజామున కిడ్నాపర్లు బాలుణ్ని వదలి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో పసివాణ్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.

author img

By

Published : Jul 25, 2019, 3:36 PM IST

Updated : Jul 25, 2019, 3:46 PM IST

boy
కిడ్నాపర్లు భయపడ్డారు...చిన్నారిని వదిలేశారు...

3రోజుల నరకయాతన ...

కిడ్నాపర్లు చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అభం సుభం తెలియని పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారు. వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి జషిత్ అనే ఐదేళ్ల బాలుడును దుండగులు ఎత్తుకెళ్లారు. వారి తల్లిదండ్రులు పిల్లాడి జాడ తెలీక బోరుమన్నారు. 3 రోజులపాటు నరకయాతన అనుభవించారు.

విస్తృతంగా గాలింపు...

పోలీసులు... వార్తా ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో బాలుడి కోసం గాలించారు. సామాన్య ప్రజలు సైతం పసివాడు క్షేమంగా తిరిగి రావాలని ఫొటో షేర్ చేశారు. 17 బృందాలు ఈ కేసు ఛేదించేందుకు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ నయీం. మండపేటలోనే మకాం వేసి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్‌స్టాప్‌లలో సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించి అనుమానితుల చిత్రాలు విడుదల చేశారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా... కిడ్నాపర్లు ఎటూ పారిపోకుండా జాగ్రత్త పడ్డారు.

భయపడిన కిడ్నాపర్లు...

పోలీసులు, పౌరసమాజం అప్రమత్తమయ్యేసరికి కిడ్నాపర్లు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పిల్లాణ్ని కిడ్నాప్‌ చేసి 3రోజులైనా... జిల్లా దాటే వీల్లేకుండా పోయింది. అదే కిడ్నాపర్ల వెన్నులో వణుకు పుట్టించింది. పరిస్థితి గమనించి బాలుణ్ని వదిలివెళ్లారు. పోలీసుల వ్యూహాత్మక ప్రచారం... జనచైతన్యం... ఈ కేసులో కీలకంగా మారింది. ఏడెనిమిది కిలోమీటర్లు పరిధి దాటి వెళ్లలేకపోయారు నిందితులు.

మమ్మీ కావాలని ఏడ్చాను: జషిత్

తనను ఎత్తికెళ్లిన వారు రోజు ఇడ్లీ పెట్టారని...మమ్మీ కావాలి అని ఏడ్చినా తీసుకెళ్లలేదని జషిత్‌ చెప్పే బుజ్జిబుజ్జి మాటలు... కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. తనను ఎవరూ కొట్టలేదని...ఎత్తుకెళ్లిన వారిలో ఒకరి పేరు రాజని చెప్పాడు. తనను వెతికేందుకు ప్రయత్నించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు జషిత్‌.

నాన్నమ్మను కొట్టి ఎత్తుకెళ్లిన దుండగులు

మండపేటలోని తమ నివాసంలో రెండో అంతస్తులో జషిత్‌ను కిడ్నాప్‌ చేశారు దుండగులు. నాన్నమ్మ వద్ద ఆడుకుంటుండగా... ఆమె మొహంపై బలంగా మోది... క్షణాల్లో జషిత్‌ను ఎత్తుకెళ్లిపోయారు కిడ్నాపర్లు. అప్పట్ని నుంచి కుటుంబ సభ్యులు నిద్రహారాలు మానేసి జషిత్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. మూడు రోజుల తర్వాత క్షేమంగా జషిత్‌ వచ్చేసరికి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

నిందితుల కోసం పోలీసుల వేట

పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. ఇంటి వద్ద బాలుడి అపహరణ, నిందితులు తప్పించుకున్న తీరు విశ్లేషిస్తున్నారు. జషిత్‌ కుటుంబం నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలో ఈనెల మూడున ఇద్దరు అపరిచితులు అద్దె ఇల్లు కోసం తిరగిన దృశ్యం సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఆ కోణంలోనూ దర్యాప్తు చేశారు. ఏదీఏమైనా చిన్నారి క్షేమంగా ఇంటికి చేరడంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తప్పించుకున్న నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

కిడ్నాపర్లు భయపడ్డారు...చిన్నారిని వదిలేశారు...

3రోజుల నరకయాతన ...

కిడ్నాపర్లు చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అభం సుభం తెలియని పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారు. వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి జషిత్ అనే ఐదేళ్ల బాలుడును దుండగులు ఎత్తుకెళ్లారు. వారి తల్లిదండ్రులు పిల్లాడి జాడ తెలీక బోరుమన్నారు. 3 రోజులపాటు నరకయాతన అనుభవించారు.

విస్తృతంగా గాలింపు...

పోలీసులు... వార్తా ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో బాలుడి కోసం గాలించారు. సామాన్య ప్రజలు సైతం పసివాడు క్షేమంగా తిరిగి రావాలని ఫొటో షేర్ చేశారు. 17 బృందాలు ఈ కేసు ఛేదించేందుకు ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ నయీం. మండపేటలోనే మకాం వేసి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్‌స్టాప్‌లలో సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించి అనుమానితుల చిత్రాలు విడుదల చేశారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా... కిడ్నాపర్లు ఎటూ పారిపోకుండా జాగ్రత్త పడ్డారు.

భయపడిన కిడ్నాపర్లు...

పోలీసులు, పౌరసమాజం అప్రమత్తమయ్యేసరికి కిడ్నాపర్లు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పిల్లాణ్ని కిడ్నాప్‌ చేసి 3రోజులైనా... జిల్లా దాటే వీల్లేకుండా పోయింది. అదే కిడ్నాపర్ల వెన్నులో వణుకు పుట్టించింది. పరిస్థితి గమనించి బాలుణ్ని వదిలివెళ్లారు. పోలీసుల వ్యూహాత్మక ప్రచారం... జనచైతన్యం... ఈ కేసులో కీలకంగా మారింది. ఏడెనిమిది కిలోమీటర్లు పరిధి దాటి వెళ్లలేకపోయారు నిందితులు.

మమ్మీ కావాలని ఏడ్చాను: జషిత్

తనను ఎత్తికెళ్లిన వారు రోజు ఇడ్లీ పెట్టారని...మమ్మీ కావాలి అని ఏడ్చినా తీసుకెళ్లలేదని జషిత్‌ చెప్పే బుజ్జిబుజ్జి మాటలు... కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. తనను ఎవరూ కొట్టలేదని...ఎత్తుకెళ్లిన వారిలో ఒకరి పేరు రాజని చెప్పాడు. తనను వెతికేందుకు ప్రయత్నించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు జషిత్‌.

నాన్నమ్మను కొట్టి ఎత్తుకెళ్లిన దుండగులు

మండపేటలోని తమ నివాసంలో రెండో అంతస్తులో జషిత్‌ను కిడ్నాప్‌ చేశారు దుండగులు. నాన్నమ్మ వద్ద ఆడుకుంటుండగా... ఆమె మొహంపై బలంగా మోది... క్షణాల్లో జషిత్‌ను ఎత్తుకెళ్లిపోయారు కిడ్నాపర్లు. అప్పట్ని నుంచి కుటుంబ సభ్యులు నిద్రహారాలు మానేసి జషిత్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. మూడు రోజుల తర్వాత క్షేమంగా జషిత్‌ వచ్చేసరికి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

నిందితుల కోసం పోలీసుల వేట

పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. ఇంటి వద్ద బాలుడి అపహరణ, నిందితులు తప్పించుకున్న తీరు విశ్లేషిస్తున్నారు. జషిత్‌ కుటుంబం నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలో ఈనెల మూడున ఇద్దరు అపరిచితులు అద్దె ఇల్లు కోసం తిరగిన దృశ్యం సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఆ కోణంలోనూ దర్యాప్తు చేశారు. ఏదీఏమైనా చిన్నారి క్షేమంగా ఇంటికి చేరడంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తప్పించుకున్న నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Intro:AP_VJA_22_25_108_EMPLOYS_NIRAVADHIKA_DEEKSHA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) నేను ఉన్నాను మీ సమస్యలు నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చాక మా సమస్యలను విస్మరించడం ఎంతవరకు సబబు అని 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో విజయవాడ ధర్నాచౌక్ వేదికగా రాష్ట్ర స్థాయి ఉద్యమానికి సిద్ధమయ్యామని వన్ ఇయర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జీవీకే సంస్థ బకాయి ఉన్న మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రైవేటు కంపెనీలకు అప్పగించి రాదని కోరారు. ప్రైవేట్ కంపెనీలు లాభాపేక్షతో పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా ఆరోపించారు. తాము విధులను బహిష్కరించిన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడం శోచనీయం అని వేలాది మంది రోగుల ప్రాణాలను సైతం ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందన్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
బైట్... కిరణ్ కుమార్ ఏపీ 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


Body:AP_VJA_22_25_108_EMPLOYS_NIRAVADHIKA_DEEKSHA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) నేను ఉన్నాను మీ సమస్యలు నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చాక మా సమస్యలను విస్మరించడం ఎంతవరకు సబబు అని 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో విజయవాడ ధర్నాచౌక్ వేదికగా రాష్ట్ర స్థాయి ఉద్యమానికి సిద్ధమయ్యామని వన్ ఇయర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జీవీకే సంస్థ బకాయి ఉన్న మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రైవేటు కంపెనీలకు అప్పగించి రాదని కోరారు. ప్రైవేట్ కంపెనీలు లాభాపేక్షతో పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా ఆరోపించారు. తాము విధులను బహిష్కరించిన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడం శోచనీయం అని వేలాది మంది రోగుల ప్రాణాలను సైతం ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందన్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
బైట్... కిరణ్ కుమార్ ఏపీ 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


Conclusion:AP_VJA_22_25_108_EMPLOYS_NIRAVADHIKA_DEEKSHA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) నేను ఉన్నాను మీ సమస్యలు నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చాక మా సమస్యలను విస్మరించడం ఎంతవరకు సబబు అని 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో విజయవాడ ధర్నాచౌక్ వేదికగా రాష్ట్ర స్థాయి ఉద్యమానికి సిద్ధమయ్యామని వన్ ఇయర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జీవీకే సంస్థ బకాయి ఉన్న మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రైవేటు కంపెనీలకు అప్పగించి రాదని కోరారు. ప్రైవేట్ కంపెనీలు లాభాపేక్షతో పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా ఆరోపించారు. తాము విధులను బహిష్కరించిన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడం శోచనీయం అని వేలాది మంది రోగుల ప్రాణాలను సైతం ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందన్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
బైట్... కిరణ్ కుమార్ ఏపీ 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Last Updated : Jul 25, 2019, 3:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.