ETV Bharat / state

కోనసీమపై అంపన్ ప్రభావం.. పునరావాస కేంద్రాలు సిద్ధం

author img

By

Published : May 19, 2020, 7:02 PM IST

అంపన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. కోనసీమ ప్రాంతంలో మత్స్యకారుల్ని వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.

amphan cyclone effect on east godavari district
కోనసీమపై అంపన్ ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ తుపాను నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో మత్స్యకార గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చారు. పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి భవాని శంకర్ తెలిపారు. తుపాను ప్రభావంతో అంతర్వేది నుంచి కాట్రేనికోన తీరం వరకు సముద్రంలో అలలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఎగసిపడుతున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్ తుపాను నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో మత్స్యకార గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చారు. పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచినట్లు అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి భవాని శంకర్ తెలిపారు. తుపాను ప్రభావంతో అంతర్వేది నుంచి కాట్రేనికోన తీరం వరకు సముద్రంలో అలలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఎగసిపడుతున్నాయి.

ఇవీ చదవండి... ఉప్పాడపై అంపన్ ప్రభావం.. ఎగసిపడుతున్న కెరటాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.