తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలలో బెట్టింగ్ నిర్వాహకుడు బుసాల విష్ణుమూర్తితో పాటు 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.1.26 లక్షల నగదు, రెండు లాప్టాప్లు, ఐదు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఇదీచదవండి.