ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నేతలు తిరుపతిలో పాదయాత్ర నిర్వహించారు. శాసనసభ్యుడు భూమన కరుణాకర్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.
ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారని కరుణాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పూర్తి బాధ్యత నాయకులపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: శానిటైజర్ గొడుగు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోజా