ETV Bharat / state

భార్య అనుమానాస్పదంగా.. భర్త ఆత్మహత్య.. ఒకేరోజు ఇద్దరూ మృతి

author img

By

Published : Jun 28, 2020, 8:58 PM IST

చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఒకేరోజు దంపతులిద్దరూ మృతి చెందారు. భార్యది అనుమానాస్పద మృతి కాగా... భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. భార్యపై భర్త అనుమానమే ఈ మృతులకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

wife and husband dead in one day in nagileru located in chittor district
wife and husband dead in one day in nagileru located in chittor district

చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం నాగిలేరులో విషాదం జరిగింది. ఆదివారం ఉదయం జ్యోతి అనే వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందగా... సాయంత్రం ఆమె భర్త శ్రీను పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పుత్తూరు డీఎస్పీ మురళీధరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు శ్రీను రోడ్ రోలర్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఇతనికి మూడు పెళ్లిళ్లు కాగా మొదటి, రెండో భార్యలు విడిచి వెళ్లిపోయారు. మూడోసారి అక్క కూతురిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్లు, ఒకటిన్నర సంవత్సరం వయసున్న ఇద్దరు బాలురు ఉన్నారు.

జ్యోతిపై శ్రీను అనుమానపడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో భార్యను శ్రీనునే హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం నాగిలేరులో విషాదం జరిగింది. ఆదివారం ఉదయం జ్యోతి అనే వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందగా... సాయంత్రం ఆమె భర్త శ్రీను పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పుత్తూరు డీఎస్పీ మురళీధరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు శ్రీను రోడ్ రోలర్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఇతనికి మూడు పెళ్లిళ్లు కాగా మొదటి, రెండో భార్యలు విడిచి వెళ్లిపోయారు. మూడోసారి అక్క కూతురిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్లు, ఒకటిన్నర సంవత్సరం వయసున్న ఇద్దరు బాలురు ఉన్నారు.

జ్యోతిపై శ్రీను అనుమానపడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో భార్యను శ్రీనునే హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి..

బాలికలను కిడ్నాప్ చేసిన వాలంటీర్లపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.